సిరిసిల్ల గాంధీచౌక్, జనవరి 8: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన కేసులో 42 మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సిరిసిల్ల ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ సోమవారం తీర్పునిచ్చారు. డిసెంబర్ 31న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు.
ఇందులో 18 మందికి ఒక్క రోజు జైలుశిక్ష, రూ. 3 వేల చొప్పున జరిమానా ఐదుగురికి రెండురోజుల జైలు రూ. 3 వేల చొప్పున జరిమానా, 19 మందికి రూ. 3 వేల చొప్పున జరిమానా విధించారు.