శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు
హుజూరాబాద్/హుజూరాబాద్రూరల్, జూలై 30: హైదరాబాద్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బండ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, విప్ బాల్క సుమన్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉద్యమ నాయకుడికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బండ శ్రీనివాస్ను హైదరాబాద్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్కుమార్, టీఆర్ఎస్ యువ నాయకుడు వొడితల ప్రణవ్బాబు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, విద్యార్థి నాయకుడు ఆవాల హరిబాబు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు కలిశారు. శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తరలివెళ్లిన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పదవీ బాధ్యతల స్వీకారానికి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సుమారు 200 వాహనాల్లో 1500 మంది వెళ్లారు.
తిమ్మాపూర్ రూరల్, జూలై 30: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్కు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దళితులకు సేవ చేయాలని కోరారు.