నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణ కానుక
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
68 మందికి కల్యాణలక్ష్మి, 30 మంది లబ్ధిదారులకు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మల్యాల, సెప్టెంబర్ 29: కరోనా వంటి విపత్కర పరిస్థితు ల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో 68మంది లబ్ధిదారులకు బుధవా రం ఆయన చెక్కులు పంపిణీ చేసి, మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డలకు కానుకగా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసి ఆర్థిక సాయం అందిస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడు తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ తహసీల్దార్ సుజాత, నాయాబ్ తహసీల్దార్ చిలుకల కృష్ణ, జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్రావు, ఏఎంసీ చైర్మన్ జనగం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్లు ముత్యాల రాంలింగారెడ్డి, అయిల్నేని సాగర్రావు, మధుసుదన్రావు, సర్పంచులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మం డలానికి చెందిన 30మందికి రూ.5.98లక్షల చెక్కులను పంపి ణీ చేశారు. ఇక్కడ నాయకులు అయిల్నేని కోటేశ్వర్రావు, జున్న సురేందర్, మ్యాక లక్ష్మణ్, తోట అంజయ్య, గడ్డ మల్లారెడ్డి, మారంపల్లి నారాయణ, పొన్నం మల్లేశం, ఎడిపల్లి అశోక్, వొల్లాల మల్లేశం, వంశీధర్, గుర్రం మల్లేశం, గడ్డం రాజేశ్వర్, అల్లూరి రాజేశ్వర్రెడ్డి, మల్యాల గణేశ్, కోరుట్ల రవి, త్రినాథ్, శ్రీనివాస్, మునుగూరి రాకేశ్, రంజిత్, ఓరుగంటి రాజేందర్రెడ్డి, బుచ్చయ్య, కొంక నర్సయ్య, రియాజ్ పాల్గొన్నారు.