జూలపల్లి, సెప్టెంబర్ 29: వడ్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్యను మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ కలిసి బుధవారం పరామర్శించారు. అంజయ్య తల్లి చంద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ క్రమంలో చంద్రమ్మ చిత్ర పటం వద్ద వారు నివాళులర్పించారు. ఇక్కడ సర్పంచ్ మాంకాలి తిరుపతి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, బాలరాజ్పల్లి ఉప సర్పంచ్ అడువాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
న్యూకొత్తపల్లి సర్పంచ్కు..
ధర్మారం,సెప్టెంబర్29: న్యూ కొత్తపల్లి సర్పంచ్ దార మల్లమ్మను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన సతీమణి స్నేహలత పరామర్శించారు. సర్పంచ్ భర్త టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చుక్కయ్య అనారోగ్యంతో మరణించిన సమాచారం తెలియడంతో స్నేహలత ఆ గ్రామానికి వచ్చారు. మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపి, మల్లమ్మను ఓదార్చారు. ఇక్కడ ఆమె వెంట చామనపల్లి సర్పంచ్ దాసరి తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు నందాల మల్లేశం, గంగాధర గంగయ్య, జుంజిపల్లి సురేందర్, నందాల లచ్చయ్య, రాదారపు రాయమల్లు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే..
జూలపల్లి, సెప్టెంబర్ 29: మండల కేంద్రానికి చెందిన సింగిరెడ్డి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మి చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వడ్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య తల్లి చంద్రమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఈ క్రమం లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్, సర్పంచులు దారబోయిన నరసింహం, మాంకాలి తిరుపతి, జూలపల్లి విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య, నాయకులు కాంతయ్య, సతీశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 29: పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మొల్మూరి విజయారావు తల్లి లక్ష్మి, టీఆర్ఎస్ నాయకుడు పిడుగు రాజయ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బండారి స్రవంతీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు, ఎంపీటీసీ తోట నర్సమ్మ శ్రీనివాస్, ఉప సర్పంచ్ బోండ్ల శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చింతపండు సంపత్, నాయకులు నీలి శ్రీనివాస్, రాపల్లి శ్రీనివాస్, పిడుగు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.