సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 29: వరద నీటిలో పడి మృతిచెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35) భార్య సంధ్య, తల్లి లక్ష్మి, కొడు కు రాము(12), కూతురు లహరి ఉన్నారు. గం గకిషన్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం వరదనీటిలో పడిపోగా బైపాస్రోడ్డు ప్రాంతంలో మృతదేహం లభించింది. వీరిది నిరుపేద కుటుంబం కావడం తో చైర్పర్సన్ జిందం కళ సూచనతో అంత్యక్రియల ఖర్చుల కోసం మున్సిపల్ ద్వారా 20 వేలు అందించారు. కిషన్ కుటుంబ పరిస్థితిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పం దించి ప్రభుత్వం ద్వారా 4లక్షలు మంజూరు చేయించారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, చైర్పర్సన్ కళ, ఆర్డీవో శ్రీనివాస్రావు, తహసీల్దార్ విజయ్, కమిషనర్ వెల్దండి సమ్మ య్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బాధిత కుటుంబానికి బుధవారం చెక్కును అందజేశా రు. చైర్పర్సన్ జిందం కళ వ్యక్తిగతంగా 10 వేలు నగదుతోపాటు నెలకు సరిపడా నిత్యవసరాలు అందించారు. కాగా అడిగిన వెంటనే ఆదుకున్న మంత్రి కేటీఆర్కు బాధిత కుటుంబసభ్యు లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, మున్సిపల్ కౌన్సిలర్లు అడ్డగట్ల మాధవి, రాపెల్లి దినేశ్, నాయకులు అడ్డగట్ల మురళి ఉన్నారు.