సైదాపూర్, జనవరి 25: ప్రజా సంక్షేమపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎనలేని ప్రజాదరణతో ముందుకు సాగుతున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఉద్ఘాటించారు. సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 20మంది నాయకులు మంగళవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్లో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆయా పథకాలకు ఆకర్షితులై విపక్షాల నుంచి అనేక మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
సీఎం రిలీఫ్ఫండ్ చెక్ల పంపిణీ
మండలంలోని ఏడుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్లను సింగాపూర్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పంపిణీ చేశారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్రెడ్డి, సర్పంచులు బత్తుల కొమురయ్య, కొండ గణేశ్, కాయిత రాములు, గాజర్ల సదానందం, బొడిగ పద్మజాకొమురయ్య, బర్మావత్ అక్షయాశ్రీనివాస్నాయక్, ఎంపీటీసీలు బద్దిపడిగ అనితారవీందర్రెడ్డి, గాజర్ల భాగ్య, దిశ కమిటీ సభ్యులు బర్మావత్ శ్రీనివాస్నాయక్, సీనియర్ నాయకులు ముత్యాల వీరారెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, ఎల్కపల్లి రవీందర్, కొమురయ్య, పొడిశెట్టి శ్యాం, హరీశ్రావు, స్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.