రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారాణి
హుజూరాబాద్టౌన్, జనవరి 25: బాలల హకులకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హనుమాండ్ల శోభారాణి పేర్కొన్నారు. హుజూరాబాద్ డివిజన్లో ఆపరేషన్ స్మైల్-8 కార్యక్రమం అమలు తీరును మంగళవారం ఆమె పరిశీలించారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి, వివిధ ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో కార్మికులకు కల్పిస్తున్న వసతులతో పాటు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఐదేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. పిల్లలతో పని చేయిస్తే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల ఇటుక బట్టీల నిర్వహణకు లేబర్ ఆఫీస్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అలాంటి వారికి వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు హుజూరాబాద్ డివిజన్లో 17 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించామని, ఏడుగురు ఇటుక బట్టీల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బాలకార్మికులు, చిన్నారులు ఆపదలో ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు 1098కు సమాచారం అందించాలని కోరారు. బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ ఆవుల సంపత్, డీసీపీవో శాంత, సీడీపీవో భాగ్యలక్ష్మి, ఎస్ఐ చీన నాయక్, లేబర్ ఆఫీసర్ చందన, ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు రమేశ్, దూడం కుమారస్వామి, సూపర్వైజర్ తిరుపతమ్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశ వరర్లు, పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.