జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. పలు గ్రామాలు, వార్డుల్లో ప్రజల నుంచి శనివారం 24,049 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడు రోజుల్లో కలిపి 52,971 దరఖాస్తులను అధికారులు స్వీకరించి, సంబంధిత రసీదులు అందిం చారు. పలు గ్రామాలు, వార్డుల్లోని కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారు లు, పరిశీలించారు. ప్రజలు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
– వేములవాడ/సిరిసిల్ల రూరల్/ ఇల్లంతకుంట/ కోనరావుపేట/ రుద్రంగి/ గంభీరావుపేట/చందుర్తి, డిసెంబర్ 30
వేములవాడ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులోని పద్మశాలీ కల్యాణ మండపంలో ప్రజా పాలన దరఖాస్తులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పరిశీలించారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో లచ్చాలుతో కలిసి జడ్పీటీసీ మంజుల పర్యవేక్షించారు. చందుర్తి మండలం రామారావుపల్లిలో ఏర్పాటు చేసిన కౌంటర్లను అదనపు కలెక్టర్ గౌతమి పరిశీలించారు. ఏర్పాటు చేసిన కౌంటర్లు, స్వీకరించిన అర్జీల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అలాగే జోగాపూర్, రామారావు పల్లె, కట్ట లింగంపేట గ్రామాల్లో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు.
ఇకడ జడ్పీటీసీ నాగం కుమార్, ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రవీందర్, ఎంపీవో ప్రదీప్ కుమార్, ఏపీఎం రజిత, తదితరులు ఉన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట, దమ్మన్నపేట, ముస్తఫానగర్, లక్ష్మీపూర్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరా వు ప్రారంభించారు. రుద్రంగి మండలం రూప్లానాయక్తండాలో దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఇల్లంతకుంట మండ లం పొత్తూరులో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఆర్డీవో పరిశీలించారు. కోనరావుపేట మండలం మంగళపల్లి, సుద్దాల, కమ్మరిపేటతండా, మర్రిమడ్ల గ్రామాల నుంచి 1,319 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు.
సంక్షేమాన్ని కొనసాగిస్తాం: విప్ ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, డిసెంబర్ 30: అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఎల్లారెడ్డిపేట మండలం సింగారం, వీర్నపల్లి మండలం లాల్సింగ్తండాలో ప్రజాపాలన కార్యక్రమాలకు హాజరై, మాట్లాడారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ డిప్యూటీ సీఈవో మచ్చ గీత, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ గుగులోత్ కళావతి, సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, తదితరులు ఉన్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో 980, బండలింగంపల్లిలో 890, సింగారంలో 266, పదిరలో 302మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు.