టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో నిహారిక-చైతన్య జంట ఒకటి. గత ఏడాది కరోనా సమయంలో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. భర్తతో ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ని అలరిస్తూ వస్తుంది. ఆ మధ్య తన కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు తన భర్త సేవలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసింది.
ఇక తాజాగా తన కోసం చైతన్య కిచెన్లో వెరైటీ వంటలు చేశాడని పేర్కొంది. చోరిజో స్పానిష్ రైస్ అనే డిష్ను చైతన్య స్వయంగా తన చేత్తో వండి తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. భార్యపై చైతన్యకి ఉన్న ప్రేమని చూసి మెగా అభిమానులు చూసి మురిసిపోతున్నారు. కరోనా వలన ఇంటికి పరిమితం అయిన నిహారిక లాక్డౌన్ తర్వాత ఓ వెబ్ సిరీస్లో నటించనుంది.