కరోనా బారిన పడి ఇంట్లో ఎలాంటి వసతి లేని వారికి ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ రూరల్ ఎడ్యుకేషన్-పీయూఆర్ఈ) సంస్థ ఉచిత క్వారంటైన్ సేవలు అందిస్తున్నది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధి సన్సిటీలోని గ్లేండేల్ విద్యాసంస్థలో 40 పడకలతో బాధితులకు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 10 మంది చికిత్స పొందుతున్నారని, ఇండ్లల్లో ఇబ్బంది పడేవారు తమ కేంద్రంలో ఉచితంగా చికిత్స పొందవచ్చని, ఇంకా 30 పడకలు ఖాళీగా ఉన్నాయని సంస్థ నిర్వాహకురాలు సంధ్య గొల్లమూడి తెలిపారు.
ఈ కేంద్రంలో నలుగురు వైద్యులు, ముగ్గురు నర్సులు, ఇద్దరు ఆయాలు ఉన్నారని, మరో 20 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారని చెప్పారు. 24 గంటలపాటు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు. హోం క్వారంటైన్లో ఉండాల్సిన వారు ఇబ్బందులు ఉంటే తమ కేంద్రంలో చికిత్స పొందవచ్చని, ఆక్సిజన్ స్థాయి 95 కంటే తగ్గితే వెంటనే అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తామని ఆమె వెల్లడించారు. ఉచిత క్వారంటైన్ కేంద్రం వివరాలకు ప్యూర్ఆన్లైన్డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో లేదా ప్యూర్ సహాయ కేంద్రం 7386140040,7075940040 నంబర్లను సంప్రదించాలన్నారు.