మంచిర్యాల : జిల్లాలోని శ్రీరాంపూర్ మండలం నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక సీతారాంపల్లి గ్రామ శివారు చెరువు సమీప చెట్ల పొదల్లో తల లేని మూడు నెలల పసికందు మృతదేహం లభ్యమైంది.
ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్ఐ టీ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామ శివారు ప్రాంతానికి శుక్రవారం ఉదయం కొందరు వెళ్లారు. దుర్వాసన వస్తుండడంతో ఆ ప్రాంతంలో వెతికారు.
చెట్ల పొదల్లో తల, ఒక చేయి లేని పసికందు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
ఆడశిశువు మృతదేహంగా గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోగా, మూడు రోజుల క్రితం చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని లక్ష పుష్పార్చన