మానకొండూర్, నవంబర్ 13 : కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకు భారీషాక్ తగిలింది. ఆయన స్వగ్రామమైన మానకొండూర్ మండలంలోని పచ్చునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి బైబై చెప్పి.. బీఆర్ఎస్కు జైకొట్టారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ మాజీ అధ్యక్షుడు కన్నం శ్రీధర్, ఉపసర్పంచ్ దాసరి వేణుగోపాల్రెడ్డితోపాటు 200 మంది నాయకులు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సీఎం కేసీఅర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి రసమయి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, సర్పంచ్ నర్మెట వసంత-వీరయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రామంచ ప్రవీణ్, నాయకులు నెల్లి మురళి, మల్లగల్ల నగేశ్, పిట్టల శ్రీనివాస్, కొమురయ్య, దాసరి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.