కేటీఆర్ బర్త్డే సందర్భంగా గతేడాది ఉమ్మడి జిల్లాలో 18 అంబులెన్స్ల వితరణ
గిఫ్ట్గా ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు
అత్యాధునిక వైద్య పరికరాలు
కొత్త వాహనాలతో తగ్గిన రెస్పాన్స్ టైం
ఇప్పటికే 10 వేల మందికిపైగా సేవలు
కరోనా సమయాన నిరంతరం అందుబాటులో
హర్షం వ్యక్తం చేస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలు
కరీంనగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ) :‘గిఫ్ట్ ఏ స్మైల్’.. వేలాది మంది ప్రాణాలు కాపాడుతున్నది.మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా గతేడాది తీసుకున్న ఈ కార్యక్రమం ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన 108 వాహనాలు రోగులకు అపర సంజీవనులయ్యాయి.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను క్షణాల్లో దవాఖానలకు చేర్చి ఊపిరి పోశాయి. కదిలే వైద్యశాలలుగా కనిపించే ఈ వాహనాల్లో అత్యాధునికమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతో మెరుగైనప్రాథమిక చికిత్స అందిస్తున్నాయి. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18 వాహనాలు ఆయా దవాఖానలకు రాగా పదివేల మందికిపైగా సేవలు అందించాయి.
గిఫ్ట్ ఏ స్మైల్.. గతేడాది మంత్రి కేటీ రామారావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే మాట.. ఈ కార్యక్రమం ద్వారా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రభుత్వ దవాఖానలకు ఐదు 108 వాహనాలను అందించారు. అంతే కాకుండా తన జన్మదిన వేడుకల కోసం ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి సేవలు చేయాలని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు జూలై 24న ప్రకటించి, వాహనాలను క్రమంగా వారి పరిధిలోని పలు దవాఖానలకు సమకూర్చారు. ఇలా మొత్తం 18 రాగా, 16 వాహనాలను జీవీకే సంస్థకు నిర్వహణ కోసం అప్పగించారు.
తగ్గిన ప్రతిస్పందన సమయం
‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా వచ్చిన 108 అంబులెన్స్ల కారణంగా ప్రతిస్పందన (రెస్పాన్స్ టైం) తగ్గి పోయింది. గతంలో ఉమ్మడి జిల్లాలో కేవలం 21 వాహనాలు కాగా, రెస్పాన్స్ టైం కూడా 25 నిమిషాల నుంచి 40 నిమిషాలు పట్టేది. 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకునే సరికి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు గాలిలో కలిసేవి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 108ల సంఖ్య 39కి చేరుకోగా రెస్పాన్స్ టైం 13 నిమిషాల నుంచి 18 నిమిషాలు మాత్రమే పడుతున్నది.
10,559 మందికి సేవలు..
గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఉమ్మడి జిల్లాకు అందిన 18 వాహనాల ద్వారా ఇప్పటి వరకు 10,559 మంది సేవలు అందుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని 7 వాహనాల ద్వారా 4,495 మంది, సిరిసిల్ల జిల్లాలో 5 వాహనాల ద్వారా 1,578 మంది, జగిత్యాల జిల్లాలో 4 వాహనాల ద్వారా 3,078 మంది, పెద్దపల్లి జిల్లాలో రెండు వాహనాల ద్వారా 1408 మందికి ఈ సేవలు లభించాయి. కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ ఇచ్చిన 4 వాహనాలు 2,550, మరో 3 వాహనాలు 1,945, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన 5 వాహనాలు 1,578, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఇచ్చిన 2 వాహనాలు 1,882, మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించిన ఒక వాహనం 796, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తనయుడు డాక్టర్ సంజయ్ ఇచ్చిన ఒక వాహనం 400 మందికి, పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఇచ్చిన ఒక వాహనం 692 మందికి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇచ్చిన ఒక వాహనం 716 మందికి ఇప్పటిదాకా సేవలు అందించాయి. ఈ వాహనాల ద్వారా 25 రకాల సేవలు అందుతుండగా, ఇందులో ముఖ్యమైనవి గర్భిణులు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, గుండె నొప్పి, ఫిట్స్, ఊపిరి సమస్య, పాము కాటు, వన్యప్రాణుల దాడుల బాధితులు, హైబీపీ, జ్వరంతో బాధపడుతున్న వారికి ప్రథమ చికిత్స అందిస్తూ సకాలంలో దవాఖానలకు చేరుస్తున్నాయి. కాగా, కరోనా సమయంలో అత్యధిక మందిని అత్యవసర సమయంలో దవాఖానలకు తరలించి ప్రాణాలను కాపాడాయి.
అత్యాధునిక వైద్య పరికరాలు..
గతంలో ప్రవేశ పెట్టిన 108 వాహనాల కంటే అత్యాధునిక వైద్య పరికరాలను ఈ వాహనాల్లో సమకూర్చారు. ముఖ్యంగా మల్టీ ప్యారా మానిటర్.. ఇది క్షతగాత్రుల బీపీ, పల్స్, ఆక్సిజన్ లెవల్స్, సాచురేషన్, ఈసీజీ, టెంపరేచర్ వంటివి ఒకేసారి చూసే అవకాశం ఉంటుంది. క్షతగాత్రుల బరువును బట్టి మెడిసిన్ ఇచ్చేందుకు సూచనలు చేసే సిరంజి పంప్, ఫిట్స్ వచ్చిన వారి కోసం సక్షన్ ఆపరేటర్, ఒకే సమయంలో ఇద్దరికి సేవలు అందించేందుకు ఆక్సిజన్ పోర్ట్స్, మాన్యువల్ బీపీ ఆపరేటర్, గ్లూకోజ్ మీటర్, అంబు బ్యాగ్ ఇలాంటివే కాకుండా ప్రతి వాహనంలో ఎప్పటికీ మూడు డెలివరీ కిట్స్, రెండు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు ఈ వాహనాలను మినీ హాస్పిటల్స్గా మార్చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగ్రాతులకు, రోగులకు ఇందులోని సిబ్బంది ప్రథమ చికిత్సతోపాటు క్రిటికల్ కేర్లో చేసే వైద్య సేవలు అందిస్తూ దవాఖానలకు తరలిస్తున్నారు. వాహనాల్లో శిక్షణ పొందిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు) అందుబాటులో ఉంటున్నారు. వీరికి మూడు నెలలకు ఒకసారి మూడు రోజుల పాటు తర్ఫీదు ఇస్తుండడంతో వారు ఎప్పటికప్పుడు వారి సామర్థ్యాలను మెరుగు పరుచుకుంటున్నారు.
తగ్గిన ప్రతిస్పందన సమయం
‘గిఫ్ట్ ఏ స్మైల్’ ద్వారా వచ్చిన 108 అంబులెన్స్ల కారణంగా ప్రతిస్పందన (రెస్పాన్స్ టైం) తగ్గి పోయింది. గతంలో ఉమ్మడి జిల్లాలో కేవలం 21 వాహనాలు కాగా, ప్రతి 30 నుంచి 40 కిలో మీటర్లకు ఒక వాహనం ఉండేది. లక్ష నుంచి లక్షన్నర జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. వాహన పాయింట్స్లో దూరంగా ఉన్నందున రెస్పాన్స్ టైం కూడా 25 నుంచి 40 నిమిషాలు పట్టేది. 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకునే సరికి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు గాలిలో కలిసేవి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 108 సంఖ్య 39కు చేరుకున్నది. కరీంనగర్ జిల్లా జనాభా 10,05,711 జనాభా ఉండగా 14 వాహనాలు ఉన్నాయి. సగటున 71,836 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంది. 10 నుంచి 15 కిలో మీటర్ల వ్యవధిలో వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి. కాల్ రాగానే 13 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి. జగిత్యాల జిల్లాలో 9,87,417 జనాభా ఉండగా 7 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సగటున 1.41 లక్షల మందికి ఒక వాహనం అందుబాటులో ఉంది. ప్రతి 20 కిలో మీటర్ల పరిధిలో ఒక వాహనం అందుబాటులో ఉంది. రెస్పాన్స్ టైం 18 నిమిషాలకు తగ్గింది. సిరిసిల్ల జిల్లాలో 5,52,037 జనాభా ఉండగా 9 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సగటున 61,337 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంది. ప్రతి 13 కిలో మీటర్లకు ఒక వాహనం అందుబాటులో ఉన్న ఈ జిల్లాలో రెస్పాన్స్ టైం కేవలం 11 నిమిషాలు మాత్రమే. ఇక పెద్దపల్లి జిల్లా జనాభా 7,95,332 ఉండగా 9 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి 88,370 మందికి ఒక వాహనం అందుబాటులో ఉంది. ప్రతి 20 కిలో మీటర్లకు ఒక వాహనం ఉన్న ఈ జిల్లాలో రెస్పాన్స్ టైం 17 నిమిషాలకు తగ్గింది.
హ్యాట్సాఫ్ కేటీఆర్..
ఒక వైద్యుడిగా చెబుతున్నాను. అంబులెన్స్లు ప్రాణదాతల్లాంటివి. ప్రమాదం సంభవించినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు రోగిని ఎంత త్వరగా దవాఖానకు తీసుకెళ్తే అంత ఎక్కువగా ప్రాణాలను కాపాడిన వారమవుతాం. గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపుతో మంత్రి కేటీఆర్ ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన పిలుపుతో ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా 90కి పైగా అంబులెన్స్లను విరాళంగా అందజేశారు. జగిత్యాల జిల్లాలో నాలుగు అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. పది నెలల కాలంలో నెలకు 100 చొప్పున 4వేల మందికి ఇవి ఆపద సమయంలో పనికి వచ్చాయి. కొవిడ్ సమయంలో అంబులెన్స్ల సేవలు మరిచిపోలేనివి. నిజంగా మంత్రి కేటీఆర్ చాలా ఉన్నతంగా ఆలోచించారు. హ్యాట్సాఫ్ కేటీఆర్. ఆయన ఇచ్చిన పిలుపు పేదల పాలిట ప్రాణరక్షణగా మారిపోయింది.
ఎంతో ప్రయోజనం ..
కేటీఆర్ సార్ బర్త్డే సందర్భంగా ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు 108 వాహనాలు గిఫ్ట్గా ఇచ్చారు. వాటితో రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. ముఖ్యంగా రెస్పాన్స్ టైం తగ్గింది. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. క్షతగాత్రులను ఎంత త్వరగా, ఎంత సురక్షితంగా దవాఖానలకు చేరిస్తే అంత త్వరగా వైద్యం అందుతుంది. కొత్త వాహనాలు కావడంతో ప్రమాద స్థలికి వేగంగా వెళ్తున్నాం. ఒక వాహనం ఒక్కో రోజు 10 కాల్స్ కూడా అటెండ్ అవుతున్నది. ఎక్కువ మందికి అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక క్షతగాత్రున్ని దవాఖానకు తరలించిన తర్వాత హైపో క్లోరైట్ సొల్యూషన్తో శానిటైజ్ చేస్తున్నాం. ప్రతి వాహనాన్నీ చాలా సురక్షితంగా ఉంచుతున్నాం.
మంచి కండిషన్లో ఉన్నాయి..
వాహనాలు మంచి కండిషన్లో ఉన్నాయి. కాల్ వచ్చిన 10 నుంచి 13 నిమిషాల్లో అటెండ్ అవుతున్నాం. బాధితులను సమయానికి దవాఖానల్లో చేరుస్తున్నాం. వాహనాలు ఇప్పటి వరకు ఎలాంటి రిపేర్కు రాలేదు. లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న వాహనాలు కావడంతో స్పీడ్గా వెళ్తున్నాం. ఎలాంటి కుదుపుల్లేకుండా వెళ్లగలుగుతున్నాం. వేగంగా సేవలు అందించగలుగుతున్నాం.