టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిక
కరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహారావు టీఆర్ఎస్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన వెంటే పెద్దసంఖ్యలో అభిమానులు, అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్తోపాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహారావు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఉదయం ఆయన వేలాది మంది అభిమానులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బయలు దేరి వెళ్లారు. మధ్యాహ్నం వరకు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన వెంటే పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పాడి కౌశిక్రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు.