ధర్మపురి, అక్టోబర్ 1: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్ ఆధ్వర్యంలో మం డలానికి చెందిన దాదాపు వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు శుక్రవారం కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. ఈ సం దర్భంగా మంత్రి వారికి కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత లు మేసు నర్సయ్య, కట్ట అంజయ్య, దమ్మ సత్తయ్య, బీజే పీ సీనియర్ నేత జక్కుల నరేశ్, కార్యకర్తలు తెలిపారు. ఇక్కడ ఆర్బీఎస్ బుగ్గారం మండల కన్వీనర్ తాండ్ర సత్యనారాయణరావు, ఎంపీటీసీ గొల్లపెల్లి మహేశ్, సీనియర్ నాయకులు బుచ్చన్న, మూల శ్రీనివాస్, దాసరి లచ్చయ్య, సత్తయ్య, శంకరయ్య, తిరుపతి, రమేశ్ ఉన్నారు.
రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు
పెద్దపల్లి (నమస్తే తెలంగాణ), అక్టోబర్ 1: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా రాష్ట్రపతికి ఆయురారోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకున్నానని మంత్రి పేర్కొన్నారు.