రైతులు భౌతిక దూరాన్ని పాటించాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్19 : రైతులు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. వెన్నంపల్లి, మంగపేట, పెగడపల్లి, కాల్వశ్రీరాంపూర్, మడిపల్లి, ఆశన్నపల్లె, అంకంపల్లి, మడిపల్లి కాలనీల్లో సెర్ప్, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా ప్రభావం కారణంగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచులు కాసం శ్రీనివాస్రెడ్డి, బుర్ర మంగ, అరెల్లి సుజాత, ఆడెపు శ్రీదేవి, మంద రమ, ఆకుల చిరంజీవి, తీగల స్వప్న, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, ఎంపీటీసీలు జెట్టి దేవన్న, కొల్లూరి రమాదేవి, మాదాసి సువర్ణ, సుముఖం నిర్మల, విండో చైర్మన్లు చదువు రాంచంద్రారెడ్డి, గజవెళ్లి పురుషోత్తం, వైస్ చైర్మన్ బీసగోని తిరుపతి, మార్కెట్ చైర్ పర్సన్ కొట్టె సుజాత, వైస్ చైర్మన్ బూసి సదాశివరెడ్డి, సీఈవోలు కోలేటి శ్రీనివాస్, బోడకుంట్ల విజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు రాజ్కుమార్ తదితరులు ఉన్నారు.
ఓదెల, ఏప్రిల్19: ఓదెల, నాంసానిపల్లిలో సెర్ప్, సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రారంభించారు . కార్యక్రమంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, వైస్ ఎంపీపీ పల్లె కుమార్గౌడ్, విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కావటి రాజు, సర్పంచ్ ఆళ్ల రాజిరెడ్డి, ఎంపీటీసీ కుమారస్వామి, నాయకులు అరెల్లి మొండయ్య, ఆకుల మహేందర్, మ్యాడగోని శ్రీకాంత్, సతీశ్, రమేశ్, కుమారస్వామి, శంకర్, తహసీల్దార్ రాంమోహన్ తదితరులు ఉన్నారు.
సుల్తానాబాద్, ఏప్రిల్ 19: సుల్తానాబాద్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏఎంసీ, సుగ్లాంపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బుర్ర శ్రీనివాస్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్రెడ్డి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు, కూలీల కోసం అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ధా న్యం తూకం వేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో నాయకులు పాల రామారావు, ముత్యం రమేశ్, పారుపెల్లి గుణపతి, మమతసంపత్, గుర్రాల శ్రీనివాస్, కూకట్ల గోపి, అన్నాడి మహిపాల్రెడ్డి, వల్స నీలయ్య, ముత్యాలు ఉన్నారు.
సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 19: సుద్దాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో రేగడిమద్దికుంటలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మినుపాల స్వరూపారాణి, సింగిల్ విండో చైర్మన్ గడ్డం మహిపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ దిలేశ్వర్రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, సర్పంచులు రవీందర్రెడ్డి, గడ్డం వసంత, ఉప సర్పంచులు వర్షిణి, ఆవుల వెంకటేశ్, సీఈవో సతీశ్ తదితరులు పాల్గొన్నారు.