కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 3: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్పేట గ్రామంలో శుక్రవారం ఆయన సర్పంచ్ కటకం నందయ్య, ఎన్నికల పరిశీలకుడు కాశెట్టి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డితో కలిసి పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. మండలంలో టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిర్ణయం మేరకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లో 11 మందితో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీ
టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా వేల్పుల శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా మొద్దుం పల్లి శంకరయ్య, కార్యదర్శిగా కటకం నరహరి, సంయుక్త కార్యదర్శిగా మంద మహేందర్, కోశాధికారిగా మంద రాజేశం, కార్యవర్గ సభ్యులుగా సుద్దాల చంద్రయ్య, మొద్దుంపల్లి లచ్చయ్య, దిడ్డి పవిత్ర, నామని సాయిలు, సముద్రాల నారాయణ, వేల్పుల సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా అడప రాజ్కుమార్, బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దిడ్డి విలాప్ ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అనుబంధ కమిటీల ఎన్నికను గ్రామ కమిటీ అధ్యక్షులకు అప్పగించారు. ఉపసర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.