జమ్మికుంట, జూలై 28: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్పష్టం చేశారు. మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చిట్యాల శంకర్, 7వ వార్డు సభ్యుడు యుగేంధర్, పలువురు నాయకులు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. అనంతరం పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తున్నదని, అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, ఎంపీపీ మమత, ప్రజాప్రతినిధులు, నాయకులు మమత, లింగారావు, భరత్కుమార్రెడ్డి, సదయ్య, సంపత్, తదితరులున్నారు.
ఈటల ఎవరినీ ఎదగనియ్యడు..
ఈటల రాజేందర్ ఎంతో అహంభావాన్ని కల్గి ఉంటడు. కార్యకర్తలను చులకనగా చూస్తడు. ఆయన తీరు నచ్చకనే బీజేపీని వీడి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన.17ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా తన సొంత ఆస్తులు పెంచుకోవడానికే పనిచేసిండు. తనవెంబడి ఉండే కార్యకర్తల బాగును ఏనాడూ పట్టించుకోలే. ఆయనలో ఉన్న అగ్రవర్ణ ధోరణి, సొంత ఎదుగుదలను సహించలేకనే ఢిల్లీలో ఆయనతో కాషాయం కండువా కప్పుకున్న నేను బీజేపీని వీడిన. టీఆర్ఎస్లో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం బీజేపీలో లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం అంకితభావంతో కృషిచేస్త.