హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్
లబ్ధిదారులకు చెక్కులు అందజేత
సైదాపూర్/చిగురుమామిడి, ఫిబ్రవరి 12: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. వె-సైదాపూర్, చిగురుమామిడి మండలాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నలుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం ఆయన హుస్నాబాద్లో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు కొత్త వినీత-శ్రీనివాస్రెడ్డి, సారాబుడ్ల ప్రభాకర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు భేతి రాజిరెడ్డి, శ్రీధర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు కాయిత రాములు, బత్తుల కొమురయ్య, తొంట కాంతమ్మ-పరశురాములు, బర్మావత్ అక్షయ-శ్రీనివాస్నాయక్, గుండేటి సునీతారాణి, జక్కుల రవి, సుద్దాల ప్రవీణ్, పీచు లీల, కానుగంటి భూంరెడ్డి, శ్రీమూర్తి రమేశ్, ముప్పిడి వెంకటనర్సింహారెడ్డి, ఎంపీటీసీలు బద్దిపడిగ అనితారవీందర్రెడ్డి, మిట్టపల్లి మల్లేశం, మెడబోయిన తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు చెలిమెల రాజేశ్వర్రెడ్డి, సాంబారి కొమురయ్య, దిశ కమిటీ సభ్యుడు బర్మావత్ శ్రీనివాస్నాయక్, నాయకులు రామోజు కృష్ణమాచారి, పెసరి రాజేశం, బత్తుల లక్ష్మీనారాయణ, తొంట రజినీకాంత్, ప్రవీణ్, శంకర్నాయక్, సాయి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.