ఎమ్మెల్యే రసమయి గొప్ప మనసు
మానకొండూర్ మండలంలోని లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కుల అందజేత
ఆడబిడ్డలకు వరం పథకం: బాలకిషన్
మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 12: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గొప్ప మనసు చాటుకున్నారు. కల్యాణలక్ష్మి చెక్కులను స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి అందజేశారు. శనివారం మానకొండూర్ మండలం లింగాపూర్, వెల్ది, లక్ష్మీపూర్, వేగురుపల్లి, ఊటూర్, రంగపేట గ్రామాల్లో కలియదిరిగారు. 20 మంది లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి వెళ్లి లక్షా నూటాపదహారు రూపాయలను విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఆడబిడ్డలు కుటుంబాలకు భారం కావద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని, ఇది ఆడబిడ్డలకు వరమని అభివర్ణించారు. చెక్కులు పంపిణీ చేస్తూ ఆయా గ్రామాల్లో సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులను, చిన్నారులను సైతం అప్యాయంగా పలకరిస్తూ పర్యటించారు. కాగా, గొప్ప పథకాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్కు, ఇంటికి వచ్చి స్వయంగా చెక్కులు అందించిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఏ ఊరుకు వెళ్లినా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. వీరి వెంట జడ్పీటీసీ శేఖర్ గౌడ్, సర్పంచ్లు ఉన్నారు.