న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల పనితీరును ప్రధాని మోదీ సమీక్షించినట్లు సమాచారం. సుమారు అయిదు గంటల పాటు కొద్ది మంది మంత్రులతో ఆయన మాట్లాడారు. గురువారం సాయంత్రం ఈ సమీక్ష సమావేవం జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో జరిగిన భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు ఇస్తామని మోదీ ప్రకటన చేసిన కొన్ని రోజులకు ఈ మీటింగ్ జరగడం గమనార్హం. ఏడుగురు మంత్రులు తాము చేపట్టిన పనుల గురించి ప్రధానికి వివరించారు. పెట్రోలియం, స్టీల్, జలశక్తి, స్కిల్ డెవలప్మెంట్, సివిల్ యేవియేషన్, భారీ పరిశ్రమలు, పర్యావరణం మంత్రిత్వశాఖలకు చెందిన మంత్రులతో మోదీ చర్చించారు. కొత్త కొత్త స్కీమ్లను ఎలా ప్రవేశపెట్టాలన్న దానిపై కొన్ని శాఖలు ప్రధానికి తెలియజేసినట్లు సమాచారం.