దుబాయ్: టీమ్ఇండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో కోహ్లీ ఒకప్పటి బ్యాటింగ్ స్టైల్ను గుర్తుచేశాడు. వరుసగా రెండు టీ20ల్లోనూ అర్ధశతకాలతో చెలరేగాడు. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో కోహ్లీ ఒక స్థానం మెరగుపరచుకొని ఐదో ర్యాంకులో నిలిచాడు.
భారత్ నుంచి టీ20ల్లో కేఎల్ రాహుల్ ఒక్కడే నాలుగో స్థానంలో చోటు దక్కించుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ..వన్డేల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ గతంలో పొట్టి ఫార్మాట్లో టాప్ ర్యాంకును కూడా అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో టాప్-5లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాట్స్మన్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. భారత్ నుంచి శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.