దోహా: దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ టోర్నీలో అడుగుపెట్టిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఖతార్ ఓపెన్లో సెమీస్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా-అండ్రెజ క్లెపెక్ (స్లోవేనియా) ద్వయం 6-2, 6-0 తేడాతో వరుస సెట్లలో నాలుగో సీడ్ అన్నా బ్లింకోవా-డబ్రోస్కీ జోడీని చిత్తుచేసింది. సెమీస్లో చెక్రిపబ్లిక్ జోడీ క్రెజ్సికోవా-సినియాకోవాను సానియా ద్వయం ఢీకొననుంది.