హైదరాబాద్ : ఈ నెల 25, 26న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగకు రావాలని ఆలయ అధికారులు, వేద పండితులు, నిర్వహణ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. మంగళవారం అరణ్య భవన్లో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అమ్మవారి ప్రసాదంతో పాటు వేదపండితులు ఆశీర్వచనాలను మంత్రికి అందించారు. ఈ నెల 25న బోనాలు, 26న రంగం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.