కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
సూర్యాపేట, మే 26 : సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28, 29తేదీల్లో నిర్వహించే కొవిడ్ టీకా కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన విభాగాలకు చెందిన సూపర్ స్ప్రెడర్లకు నిర్దేశించిన కేంద్రాల్లో టీకా వేయించాలని చెప్పారు. అందుకు ఆయాశాఖల అధికారులు సమన్వయం చేయాలని కోరారు. టీకా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పెట్రోల్బంక్ ఓనర్లు, సిబ్బంది, డెలివరీ బాయ్స్, గ్యాస్ ఏజెన్సీ ఓనర్లు, సిబ్బంది, డెలవరీ బాయ్స్ వివరాలు సేకరించాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాదారులు, అందులో పనిచేసే వారు, సీడ్ డీలర్స్, హమాలీలకు టీకా వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సైతం టీకా వేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, డీఎస్ఓ విజయలక్ష్మి, ఏడీఏ రామారావు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు మరువలేనివి.. : కలెక్టర్
కరోనా మహమ్మారిని తరిమికొట్టే పోరాటంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా పేషెంట్లకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు మరవలేనివన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయంతోపాటు డాక్టర్ శ్రీపతిరెడ్డి 50వేల విలువ గల ఎన్-95 మాస్క్లు, మూడు వేల గ్లౌజులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, అడ్వకేట్ శశిధర్, డాక్టర్ రామకృష్ణ, బైరు రమేశ్, తోట శ్యాం పాల్గొన్నారు.