అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,285
కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,120 శాంపిల్స్ పరీక్షించగా 18,285 మందికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 16,24,495 పాజిటివ్ కేసులకు గాను 14,21,964 మంది డిశ్చార్జ్ కాగా కరోనా వల్ల 10,427 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.