మల్లాపూర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని కేఎంఆర్ గార్డెన్లో జరిగిన టీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సబ్బండ వర్ణాల అభ్యున్నతికి అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గెలిచిన వెంటనే పసుపు బోర్డు, ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి గెలిచిన ఎంపీ అర్వింద్కు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు.
అనంతరం పార్టీ మండలాధ్యక్షుడిగా తోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దేవర
సురేశ్రావులతోపాటు కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అలాగే గొరెపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. నూతనంగా ఎన్నికైన మండల, గ్రామశాఖ అధ్యక్షులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. గాయకుడు లింగారెడ్డి పాడిన పాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
కార్యక్రమంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, మార్కెట్కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, మండలాధ్యక్షుడు కొమ్ముల జీవన్రెడ్డి, వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మైదాస్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి, సింగిల్విండో చైర్మన్లు వేంపేట నర్సారెడ్డి, బద్దం అంజిరెడ్డి, నేరేళ్ల మోహన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు.
కొలువుదీరిన మండల నూతన కార్యవర్గం
టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడిగా తోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దేవర సురేశ్రావు, యూత్ అధ్యక్షుడిగా మ్యాకల సతీశ్, బీసీ సెల్ అధ్యక్షుడిగా నాగుల రమేశ్, రైతు విభాగం అధ్యక్షుడిగా కాటిపల్లి అంజిరెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడిగా మగ్గిడి జగన్, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడిగా గుగ్లావత్ రాజేందర్నాయక్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడిగా ఎండీ రఫీ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఇనుగుర్తి సరిత, కార్మిక విభాగానికి ఏజీగి తిరుపతి, సోషల్ మీడియా విభాగానికి రఫీలతో పాటు, పలువురు కార్యవర్గ సభ్యులు నియమితులయ్యారు.