పార్టీలోకి హుజూరాబాద్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు
సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో చేరిక
ఐదెకరాల్లో ఆటోనగర్ ఏర్పాటు చేస్తాం: మంత్రి హరీశ్రావు
ఈటలకు ఓటుతో బుద్ధి చెప్పాలి
హుజూరాబాద్ టౌన్, జూలై 16: టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీకి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై అంతా జై కొడుతుండగా, ప్రతిపక్ష పార్టీల నేతల్లో కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. శుక్రవారం సిద్ధిపేట జిల్లా రంగనాయకసాగర్ గెస్ట్హౌస్లో మంత్రి హరీశ్రావును హుజూరాబాద్లోని మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా, మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 350మంది మోటార్ ఫీల్డ్ వర్కర్స్కు సంబంధించి ఆటోనగర్ ఏర్పాటుకు సువిశాలమైన స్థలం, అక్కడ రోడ్లు, కరెంట్, వాటర్ సైప్లె మురుగు కాలువల నిర్మాణం, దుకాణాల కోసం షెడ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని, అందులో భాగంగానే హుజూరాబాద్లో ప్రత్యేక ఆటోనగర్ను ఏర్పాటు చేయడంతో పాటు అందరికీ దుకాణ సముదాయం నిర్మించి ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు అండగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని సూచిస్తూనే, గత పాలకుడి నిర్లక్ష్యంతోనే హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లుగా మారిందని, ఈటల తప్పుడు నిర్ణయం వల్లే ప్రజలపై ఎన్నికల భారం పడిందని, అలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వినతి..
అలాగే హుజూరాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు సిద్దిపేటలో మంత్రి హరీశ్రావును కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. దీంతో సానుకూలంగా స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ టూ వీలర్ అధ్యక్షుడు గజ్జి సమ్మయ్య, ఎలక్ట్రీషియన్ అండ్ బ్యాటరీ వర్కర్స్ అధ్యక్షుడు మారటి శ్రీనివాస్, ఇంజినీరింగ్ అండ్ వెల్డింగ్ వర్కర్స్ అధ్యక్షుడు నలుబాల నవీన్కుమార్, ట్రాక్టర్స్ మెకానిక్ అధ్యక్షుడు కొండపర్తి వీరాచారి, లారీ, కారు, జీపు మెకానిక్ అధ్యక్షుడు ఎండీ సలావోద్దీన్, కల్లర్, సర్వీసింగ్, గ్యాస్ వెల్డింగ్ అధ్యక్షుడు గజ్జెల సాంబయ్య, టైర్ వర్కర్స్ అధ్యక్షుడు ఎస్కే యాకుబ్, ఆటో మొబైల్ అధ్యక్షుడు దండ ప్రభాకర్రెడ్డి, టీచర్స్ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి అల్లాడి ఉమాశంకర్, అడ్వయజర్ మెట్పల్లి రవీందర్, పానుగంటి రవీంద్రనాథ్, సబ్బని రాజేందర్, మాచవరం సురేష్, వేణు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గందె శ్రీనివాస్, పోరెడ్డి శంతన్రెడ్డి, 300మందికిపైగా పాల్గొన్నారు.
ఇక్కట్లు తొలగిపోతయి
వాహనాల స్పేర్పార్ట్స్ కొ నుగోలుకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందవుతుంది. అంతేగాక ఇక్కడ దొ రకని వస్తువుల కోసం కరీంనగర్, వరంగల్కు వెళ్లాల్సి వ స్తుంది. ఆటోనగర్ ఏర్పాటుతో ఎలాంటి స్పేర్పా ర్ట్స్ అయినా ఇక్కడే దొరుకుతాయి. ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నయి. అందుకే మా కోసం ఆటోనగర్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సంసిద్ధత వ్యక్తం చేయడం, మంత్రి హరీశ్రావు చకచకా కార్యాచరణ చేపట్టడం సంతోషంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటం.