కీవ్: తక్షణమే శాంతి చర్చలు చేపట్టాలని రష్యాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. దాడుల్ని తగ్గించుకోవాలని ఆయన రష్యాకు సూచించారు. ప్రాంతీయ సమగ్రతను, న్యాయాన్ని పరిరక్షించేందుకు ఈ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. చర్చలు నిర్వహించేందకు సమయం ఆసన్నమైందని, లేదంటే రష్యాకు భారీ నష్టం జరుగుతుందని, దాని నుంచి కోలుకునేందుకు ఆ దేశానికి తరాలు పడుతుందని అన్నారు. ఇక మారిపోల్ నగరంలో భీకర ఘర్షణ జరుగుతోంది. నగరం నడిబొడ్డున రెండు దేశాల సైన్యం తలపడుతోంది. నగరంలో ఉన్న 80 శాతం బిల్డింగ్లు దాదాపు ధ్వంసం అయ్యాయి. మారిపోల్ వద్ద ఓ థియేటర్పై బాంబు వేసిన ఘటన తెలిసిందే. ఆ ఘటనలో వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.