Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించిన మస్క్.. ఇటీవల భారీగా లేఆఫ్లు ఉంటాయని ప్రకటించారు. తాజాగా ట్విట్టర్ పెయిడ్ వర్షెన్ను తీసుకొచ్చే యోచనలో మస్క్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పలు వార్తా సంస్థలు ప్రచురించిన కథనాల ప్రకారం… ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ అకౌంట్ను వెరిఫికేషన్ చేసి బ్లూ టిక్ ఇవ్వడానికి ఇక నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వెరిఫైడ్ యూజర్స్ నెలకు 4.99 డాలర్లు ట్విటర్కు చెల్లిస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.415 అన్నమాట. తాజా మార్పులో భాగంగా నెల వారీ బ్లూటిక్ సహా అదనపు ఫీచర్ల సబ్స్క్రిప్షన్ ధరను ఇకపై 19.99 (మన కరెన్సీ ప్రకారం 1650) డాలర్లుకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా తుది నిర్ణం తీసుకోలేదని తెలుస్తోంది.
ట్విట్టర్ యూజర్లలో సెలబ్రెటీల ఖాతాలకు బ్లూ చెక్ మార్క్ ఉంటుంది. ఈ మార్క్ ఉందంటే సదరు ఖాతా ఒరిజినల్ అని అర్థం. ట్విట్టర్ ప్రతినిధులు ఆయా సెలబ్రెటీలను సంప్రదించి, వారి ఖాతాలను నిర్ధారించాకే ఈ బ్లూ టిక్ మార్క్ను ఇస్తారు. ఈ వెరిఫికేషన్, బ్యాడ్జ్ ఇవ్వడం వల్ల సెలబ్రెటీలకు నకిలీల బెడద తప్పుతుంది. అదే సమయంలో ఆయా సెలబ్రెటీల అభిమానులకు స్పష్టత ఉంటుంది.