ఇస్లామాబాద్: కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ ఇప్పుడు పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో భాగం కానున్నారు. ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్కు ఆమె ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించనున్నారు. మానవ హక్కులు, మహిళా సాధికారిత తదితర అంశాలలో ఆమె సలహాదారుగా ఉంటారని పాక్ వర్గాలు తెలిపాయి. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జేకేఎల్ఎఫ్ కమాండర్ యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష పడటంతో ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిద్దరికీ 2009లో వివాహమైంది.