ఓ విమాన ప్రయాణికుడి పట్ల మహిళ దురుసుగా ప్రవర్తించింది. టంపా నుంచి అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఫ్లైట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 23వ తేదీన డెల్టా ఫ్లైట్లో పాట్రిసియా కార్న్వాల్(51) బాత్రూమ్కు వెళ్లి.. తన సీటు వద్దకు తిరిగి వస్తోంది. ఈ క్రమంలో బేవరేజెస్ కార్ట్ కూడా రావడంతో.. కొంచెం జరగాలని కార్న్వాల్ను సిబ్బంది రెక్వెస్ట్ చేశాడు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. నేను ఎవరు? రోసా పార్క్స్? అని చెప్పారు. (ఆఫ్రికన్ – అమెరికన్ సివిల్ రైట్స్ కార్యకర్తనే రోసా పార్క్స్. 1955లో రోసా పార్క్స్ బస్సులో శ్వేత జాతీయుడికి సీటు ఇచ్చేందుకు నిరాకరించింది.)
ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు స్పందిస్తూ మీరు బ్లాక్ కాదు.. ఇది అలబామా కాదు.. అంత కంటే బస్సు కూడా కాదు అని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కార్న్వాల్కు, ఆ ప్రయాణికుడికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ ప్రయాణికుడిపై కార్న్వాల్ దాడి చేసి చెంప ఛెల్లుమనిపించింది. అంతే కాదు అతని ముఖంపై ఉమ్మేసింది. మాస్కు ధరించాలని ఆమె అతన్ని హెచ్చరించింది. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన కార్న్వాల్ను ఎఫ్బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.