బీజింగ్: ప్రపంచమంతటా కరోనా కేసులు తగ్గుతుంటే చైనాలో మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో (బుధవారం నుంచి గురువారం నాటికి) దేశవ్యాప్తంగా 31,444 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు పరిమితమైన లాక్డౌన్ను దేశమంతటా విస్తరిస్తున్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అధికారులు సూచించారు. చాలా నగరాల్లో వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నారు. నగరాల్లో అపార్టుమెంట్లను క్వారంటైన్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. రాజధాని బీజింగ్లో ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్లో ఓ దవాఖానను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా కట్టడికి ఇప్పటికే అమలు చేస్తున్న ‘జీరో కొవిడ్’ పాలసీని మరింత కట్టుదిట్టం చేస్తున్నది. మరోవైపు కఠిన ఆంక్షలపై ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.