న్యూయార్క్ : సూర్యుడు భూమిని మింగేస్తాడా? భూ గ్రహం అంతమైపోతుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా బిలియన్ సంవత్సరాల తర్వాత ఇటువంటి ఘటనే జరగవచ్చని అంటున్నారు.
సూర్యుడిలోని ఇంధన పదార్థాలు అయిపోయాక, అవసాన దశలో భూమితో పాటు ఇతర గ్రహాలను తనలో కలిపేసుకుంటాడని అంటున్నారు. 12 వేల కాంతి సంవత్సరాల దూరంలో అవసాన దశలో ఉన్న ఓ నక్షత్రం 100 రెట్లు ప్రకాశవంతంగా మారి తన సొంత గ్రహాన్ని మింగేయడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.