Twitter | ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసిన అనంతరం ఎలాన్ మస్క్ పలు మార్పులు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా పెయిడ్ సర్వీసులను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం 7.99 అమెరికన్ డాలర్లను వసూలు చేయనున్నది. ఈ సేవలు భారత్లో ఎప్పటి నుంచి ప్రారంభవుతాయో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతుండగా.. ఈ విషయంపై ఎలాన్ మస్క్ స్పష్టతనిచ్చారు. ట్విటర్వినియోగదారుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రీమియం సర్వీసులు నెల రోజుల్లో భారత్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సర్వీసులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలోని ఐఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు.. పెయిడ్ ఐఫోన్ యూజర్ల కోసం మెరుగైన ఫీచర్లను ట్విట్టర్అందుబాటులోకి తీసుకువస్తున్నది.
బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం 7.99 డాలర్లు చెల్లించే యూజర్ల కోసం కొన్ని అదనపు కొత్త ఫీచర్లను ప్రారంభించనున్నట్లు ట్విట్టర్తెలిపింది. ట్విట్టర్బ్లూ సబ్స్క్రిప్షన్కింద వినియోగదారులు మెరింత ఎక్కువ నిడివి ఉండే వీడియోలతో పాటు ఆడియోలను సైతం పోస్ట్చేసేందుకు అవకాశం కలుగనున్నది. సాధారణ వినియోగదారులతో పోలిస్తే ట్విట్టర్ బ్లూ సబ్స్క్రైబర్లకు సగం ప్రకటనలు తగ్గుతాయి. ఈ యూజర్లు సైతం పెయిడ్ఆర్టికల్స్ను ఉచితంగా చదివే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో వినియోగదారులు ట్వీట్లను సవరించే సామర్థ్యం, డౌన్వోట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. పెయిడ్సర్వీసులపై యూజర్లు అంతృప్తి వ్యక్తం చేయగా.. మీరు చెల్లించే దానికి మీరు సేవలను పొందుతారు అని ఎలాన్ మస్క్ ఇంతకు ముందు ట్వీట్చేశారు. ట్విట్టర్ను టేకోవర్ చేసిన అనంతరం ఎలా మస్క్.. భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగుల తొలగింపు మొదలు బ్లూ టిక్ వినియోగదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్లు.. (భారతీయ కరెన్సీలో రూ.600) వసూలు చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు.