ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో మంగళవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దీంతో తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహ్మద్ యూనస్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ప్రభుత్వంలో ఆయన పోషించే పాత్రపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఆయనకు రాజ్యాంగబద్ధ పదవి, ముఖ్యంగా దేశాధ్యక్ష పదవి ఇవ్వాలనే డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. ఈ ఊహాగానాలపై కాబోయే ప్రధాని తారిఖ్ రహ్మాన్ సలహాదారు హుమాయూన్ కబీర్ స్పందిస్తూ, ‘యూనస్తో చర్చలు జరిగాయి. కానీ ఏ పదవీ ఖరారు కాలేదు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు’ అని అన్నారు. అయితే ఈ ప్రచారాన్ని మహ్మద్ యూనస్ కార్యాలయం ఖండించింది.
తారిఖ్ ప్రమాణ స్వీకారానికి 12 దేశాలకు ఆహ్వానం అందింది. అదే రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ప్రధాని మోదీ సమావేశం కావాల్సి ఉండటం వల్ల ఆయన బదులు భారత్ తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిసింది.