Water Fuel | కాలిఫోర్నియాకు చెందిన ఇన్ఫినియం ప్రపంచంలోనే తొలి ఈ-ఫ్యూయల్ తయారీదారుగా అవతరించబోతున్నది. కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించి ఇండస్ట్రియల్ స్కేల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసింది. ఓ మీడియా నివేదిక ప్రకారం.. కంపెనీకి చెందిన కార్పస్ క్రిస్టీ, టెక్సాస్ ఆధారిత ప్లాంట్ ఇలాంటి ఇంధనాన్ని పారిశ్రామిక స్థాయి ఉత్పత్తిని కాన్సెప్ట్ నుంచి వాస్తవికత వైపు తీసుకువెళ్లిన ప్రపంచంలోనే తొలి ప్లాంట్గా అవతరించనున్నది. పవన, సౌర విద్యుత్ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా మార్చే సాంకేతిక పరిజ్ఞానం ఉందని నివేదిక పేర్కొంది.
ఇందులో హైడ్రోజన్ని రియాక్టర్కు పంపుతారు. అక్కడ ఇది CO2 (కార్బన్ డయాక్సైడ్)తో కలుస్తుంది. అప్పుడు ఇది శిలాజ ఇంధనాన్ని పోలిన లక్షణాలను కలిగి ఉన్న సింథటిక్ ఇంధనంగా మారుతుంది. నివేదిక ప్రకారం.. ఇన్ఫినియం సుమారు 8,300 లీటర్ల ఎలక్ట్రోఫ్యూయల్ లేదా ఈ-ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. యుఎస్ అంతటా వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. ‘పునరుత్పాదక ఇంధనం- కార్బన్ డయాక్సైడ్తో తయారైన స్వచ్ఛమైన ఇంధనం’ అనే నినాదంతో ఉన్న ఈ సంస్థకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అయితే, క్లీన్ ఎనర్జీపై పని చేస్తున్న ఆవిష్కర్తలను కలిసేందుకు గతంలో ఆయన టెక్సాస్కు వెళ్లారు.
తన బ్లాగ్లో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ‘నేను కార్పస్ క్రిస్టీలోని మొదటి ప్లాంటును సందర్శిస్తున్నాను. అక్కడ వ్యర్థ కార్బన్ డయాక్సైడ్, పునరుత్పాదక శక్తిని ట్రక్కుల కోసం ఎలక్ట్రోఫ్యూయల్ లేదా ఇ-ఇంధనంగా మారుస్తున్నారు. ఇప్పటికే అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మీరు ఆ ప్రాంతంలో నివసిస్తుంటే మీరు ఇన్ఫినియం ఇ డీజిల్ పొందవచ్చు’ అని బ్లాగ్లో పేర్కొన్నారు. ఇన్ఫినియం ప్రత్యేకత ఏమిటంటే.. ఇంధనాన్ని ఇప్పటికే ఉన్న ఇంజిన్ల కోసం వినియోగించవచ్చని బిల్గేట్స్ పేర్కొన్నారు. ట్రక్కులు, ఓడలు, విమానాల్లోనూ ఉంచవచ్చని గేట్స్ చెప్పారు. దీన్ని ట్రక్కులు, ఓడలు, విమానాలు కూడా వాడవచ్చని పేర్కొన్నారు.