టెల్ అవివ్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక, ఇజ్రాయెల్ను సందర్శించారు. (
Ivanka visits Israel) భర్త జారెడ్ కుష్నర్తో కలిసి బందీల కుటుంబాలను పరామర్శించారు. ఇవాంక భర్త ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి అనాగరిక చర్య అని విమర్శించారు. హమాస్ కిడ్నాప్ చేసిన కుటుంబాలతోపాటు గాజాలో ఇంకా బందీలుగా ఉన్న బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించినట్లు చెప్పారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న పలువురు రాజకీయ నేతలను కూడా తాము కలిసినట్లు వెల్లడించారు. ఇవాంక దంపతుల ఇజ్రాయెల్ సందర్శన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా వందలాది మందిని బందీలుగా గాజాకు పట్టుకెళ్లారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆర్మీ బాంబు దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 20,000 మందికిపైగా మరణించారు. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ తొలుత ఇజ్రాయెల్ నాయకత్వాన్ని విమర్శించారు. అయితే అనంతరం ఆ దేశానికి మద్దతుగా ట్వీట్ చేశారు.
Today I visited Kibbutz Kfar Aza with @IvankaTrump & @jaredkushner so that they could bear witness to the crimes against humanity committed by Hamas on 7 October.
Thank you for coming to Israel and for standing by our side 🇮🇱🇺🇸
(📹: Natan Weill | Knesset Press Office) pic.twitter.com/wZbqqNBXj8
— Amir Ohana – אמיר אוחנה (@AmirOhana) December 21, 2023