Kenya | నైరోబీ: పశ్చిమ కెన్యాలో భారీ డ్యామ్ కూలిపోవడంతో 45 మంది దుర్మరణం చెందారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు డ్యామ్లోకి భారీగా నీరు చేరడంతో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా డ్యామ్ గోడలు కూలిపోయాయి. ఒక్కసారిగా నీటిప్రవాహం ఇండ్ల మీదుగా రావడంతో సుమారు 45 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.
రిఫ్ట్వ్యాలీకి చెందిన మాయి మహియు ప్రాంతంలోని ఓల్డ్ కిజబే డ్యామ్ కూలడంతో దిగువ ప్రాంతంలోని ఊర్లపైకి వరద ఉధృతి రావడంతో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ఇండ్లలోకి నీరు చేరింది. వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోగా, మరికొందరు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ఇప్పటివరకు వంద మందికిపైగా మృత్యువాత పడినట్టు పేర్కొన్నారు.