కేప్ కెనరవల్: చంద్రుడిపై అమెరికా ల్యాండర్ దిగి 50 ఏళ్లు దాటింది. ఇప్పుడు మళ్లీ ఆ దేశానికి చెందిన నాసా ఓ ప్రైవేటు సంస్థతో కలిసి సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ఇవాళ కేప్ కెనరవల్ నుంచి వొల్కన్ రాకెట్ను ప్రయోగించింది. ఆ రాకెట్ ద్వారా పెరిగ్రిన్ 1 ల్యాండర్(Nasa Moon Lander)ను పంపింది. 1972లో చివరిసారి అమెరికాకు చెందిన అపోలో మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఇవాళ ప్రయోగించిన పెరిగ్రిన్ 1 ల్యాండర్.. ఫిబ్రవరిలో చంద్రుడిపై దిగే ఛాన్సు ఉంది.
The first U.S. commercial robotic launch to the Moon successfully lifted off Jan. 8 on the first flight of @ULALaunch’s #VulcanRocket. @Astrobotic’s Peregrine Mission 1 lander is expected to reach the lunar surface in February: https://t.co/csvx73ZqgP pic.twitter.com/N7Mxiqi8GC
— NASA (@NASA) January 8, 2024
ఆ ల్యాండర్లో అనేక శాస్త్రీయ పరికరాలను నాసా పంపించింది. ఫ్లోరిడాలోని కేప్ కెనరవల్ అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 2 గంటలకు వొల్కన్ రాకెట్ను ఫైర్ చేశారు. అయితే పెరిగ్రిన్ 1 ల్యాండర్.. ఫిబ్రవరి 23వ తేదీన చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. స్పేస్ రోబోటిక్స్ సంస్థ ఆస్ట్రోబోటిక్ .. పెరిగ్రిన్ 1 ల్యాండర్ను నిర్మించింది. అయితే ప్రైవేటు సంస్థకు చెందిన ఓ ల్యాండర్ చంద్రుడిపై దిగడం ఇదే ప్రథమం కానున్నది.
భవిష్యత్తులో చేపట్టబోయే మానవ మిషన్లకు చెందిన డేటాను పెరిగ్రిన్ సేకరించనున్నది. చంద్రుడిపై కొత్తగా నామకరణం చేసిన బే ఆఫ్ స్టికీనెస్ ప్రాంతంలో పెరిగ్రిన్ ల్యాండర్ దిగనున్నది. పెరిగ్రిన్లో నాసాకు చెందిన మొత్తం 5 పేలోడ్స్ ఉన్నాయి. మిగితా దేశాలకు చెందిన మరో 15 పేలోడ్స్ కూడా ఉన్నాయి. చంద్రుడిపై ఉన్న రేడియేషన్ లెవల్స్, సర్ఫేస్.. సబ్ సర్ఫేస్ నీటి స్థాయి, అయస్కాంత శక్తిని ఆ పరికరాలను పసికట్టనున్నాయి. చంద్రుడిపైకి మనుషులు వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆ డేటా ద్వారా తెలుసుకోనున్నారు.