వాషింగ్టన్, ఏప్రిల్ 4: అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పట్ల కీలక రాష్ర్టాల్లో ఓటర్లు చాలా అసంతృప్తిలో ఉన్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ ఇటీవల నిర్వహించిన ఒపీనియన్ పోల్లో బైడన్ కన్నా డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్టు తేలింది. త్వరలో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.
ఏడు రాష్ర్టాల్లో సర్వే చేయగా ట్రంప్కు ఆధిక్యం లభించినట్టు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ర్టాలే కీలకమన్న అంచనాలున్నాయి. ఒక్క విస్కాన్సిన్ రాష్ట్రంలో మాత్రమే బైడన్కు ట్రంప్ కన్నా మూడు పాయింట్లు ఎక్కువగా వచ్చాయి.