Turkey Earthquake: టర్కీ-సిరియా సరిహద్దుల్లో గత సోమవారం సంభవించిన భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాలను తొలగించినాకొద్ది శవాలు బయటపడుతున్నాయి. రెండు దేశాల భూభాగాల్లో కలిపి ఇప్పటివరకు మృతుల సంఖ్య 34 వేలు దాటింది. టర్కీలో 30 వేలకుపైగా, సిరియాలో నాలుగు వేలకు పైగా మృతదేహాలు బయటపడ్డాయి.
అయితే భూకంపం సంభవించి వారం రోజులవుతున్నా శిథిలాల కింద నుంచి ఇంకా కొంతమంది ప్రాణాలతో బయటపడుతుండటం ఆశ్చర్యం పరుస్తున్నది. ఆహారం, మంచినీళ్లు కూడా లేకుండా వాళ్లు వారం రోజులు బతికి ఉండటం విస్మయం కలిగిస్తోంది. తాజాగా హతాయ్ ప్రావిన్స్లోని వేర్వేరు ప్రాంతాల్లో శిథిలాల నుంచి ముస్తఫా అనే ఏడేండ్ల బాలుడు, 62 ఏండ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడ్డారు.
ఏడేండ్ల బాలుడిని రక్షించేందుకు బ్రిటన్కు చెందిన రెస్క్యూ టీమ్స్ చాలా రిస్క్ చేశాయి. ముస్తఫా చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించి అతడి దగ్గరి వరకు శిథిలాలను తొలగిస్తూ సొరంగాన్ని ఏర్పాటు చేశాయి. ఓ రెస్క్యూవర్ ఆ సొరంగం గుండా లోపలికి వెళ్లి బాలుడిని బయటికి తీసుకొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
Footage of the British rescue team digging a tunnel to access a buried person #TurkeyEarthquake #Turkey #Turquia #Turkey_earthquake #earthquaketurkey #uk pic.twitter.com/BYrbR8Fh4b
— REPORT WAR (@troy_dalio) February 12, 2023