వాషింగ్టన్ : మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని మిషిగన్కు చెందిన వైదేహి డోంగ్రే(25) కైవసం చేసుకుంది. ఈ అందాల పోటీల్లో జార్జియాకు చెందిన అర్షి లలాని మొదటి రన్నరప్గా నిలిచింది. డోంగ్రే యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఓ ప్రధాన సంస్థలో వ్యాపార అభివృద్ధి నిర్వాహకురాలిగా పనిచేస్తుంది. అందాల పోటీలో విజేతగా నిలిచిన అంశాన్ని తన ఇన్స్టాగ్రాం పేజీ ద్వారా తెలుపుతూ డోంగ్రే పలు చిత్రాలను పంచుకుంది. ఈ విజయం తన ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచిందన్నారు. మహిళల ఆర్థిక స్వాతంత్రం, అక్షరాస్యతపై దృష్టి సారించనున్నట్లు ఆమె వెల్లడించింది.
భారతీయ సంతతికి చెందిన మహిళల శక్తిసామర్థ్యాలు పెంపొందేలా, వారిని ప్రోత్సహించేందుకు ఈ మిస్ ఇండియా యూఎస్ఏ పోటీలు ఓ వేదికగా నిలుస్తున్నాయి. తన భవిష్యత్ లక్ష్యాలు అందుకునేందుకు మిస్ ఇండియా యూఎస్ఏ వేదిక దోహదపడనున్నట్లుగా డోంగ్రే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్ లో అద్భుత ప్రతిభకుగాను డోంగ్రే ‘మిస్ టాలెంటెడ్’ అవార్డు గెలుచుకుంది. మిస్ ఇండియా యూఎస్ఏ, మిసెస్ ఇండియా యూఎస్ఏ, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ ఈ మూడు విభాగాల్లో జరిగిన పోటీలలో 30 రాష్ట్రాల నుండి 61 మంది పోటీదారులు పాల్గొన్నారు. మూడు విభాగాల విజేతలు ప్రపంచవ్యాప్త పోటీలలో పాల్గొనడానికి ముంబైకి కాంప్లిమెంటరీ టిక్కెట్లు పొందుతారు.