వాషింగ్టన్: తమ గగనతలంపై ఎగురుతున్న నిఘా బెలూన్ను అమెరికా కూల్చివేసింది. ఉత్తర అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడంతో అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీంతో చైనా నిఘా బెలూన్ను అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు దేశ తూర్పుతీరంలో కూల్చివేసినట్లు పెంటగాన్ ప్రకటించింది. ఉత్తర అమెరికాలోని సున్నిత సైనిక ప్రదేశాలపై అది గూఢచర్యం చేస్తున్నదని పేర్కొన్నది.
అధ్యక్షుడు బైడెన్, జాతీయ భద్రతా బృందం ఎల్లప్పుడూ అమెరికా ప్రజల భద్రకు తొలి ప్రాధాన్యం ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. తమ సార్వభౌమాధికారాన్ని చైనా ఉల్లంఘించడాన్ని సమర్థవంతంగా ప్రతిస్పందించామన్నారు. కాగా, లాటిన్ అమెరికా గగనతలం మీదుగా ప్రయాణిస్తున్న మరో నిఘా బెలూన్ను పెంటగాన్ గుర్తించింది. అది చైనాకు చెందిన మరో నిఘా బెలూన్గా అంచనా వేస్తున్నామని, ప్రస్తుతానికి ఇంతకంటే సమాచారం తమ వద్ద లేదని పెంటగాన్ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైటర్ వెల్లడించారు.
కాగా, ఎఫ్-22 యుద్ధ విమానం నుంచి క్షిపణిని ప్రయోగించి ఆ బెలూన్ను పేల్చినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ కాలిఫోర్నియా మర్టల్ బీచ్ ప్రాంతంలో బెలూన్ శకలాలు పడ్డాయని, వాటిని సేకరించేందుకు మిలటరీ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. శకలాలను సేకరించి బెలూన్లో ఏమున్నాయనే విషయాన్ని పరిశీలించనున్నారు.
Incredible HD footage of the Chinese surveillance balloon being shot down. pic.twitter.com/K1GxdcJuH1
— Graham Allen (@GrahamAllen_1) February 4, 2023