వాషింగ్టన్: భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden wishes) ట్విట్టర్ వేదికగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. 1947 ఆగస్టు 15 న మహాత్మా గాంధీ సూచించిన సత్యం, అహింస సందేశాలను అనుసరించడం ద్వారా భారతదేశం స్వాతంత్ర్యం వైపు సుదీర్ఘ ప్రయాణం సాధించిందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా లక్షలాది మంది భారతీయ-అమెరికన్ల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ట్విట్టర్లో రాశారు. భారతదేశం-యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య భాగస్వామ్యం గతంలో కంటే చాలా ముఖ్యమైనదని జో బైడెన్ అన్నారు. రెండు గొప్ప, విభిన్న ప్రజాస్వామ్యాలు ప్రతిచోటా ప్రజల కోసం పని చేయగలవని మనం కలిసి ప్రపంచానికి చూపిద్దామని సూచించారు.
భారతదేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక, ఇతర రంగాలలో భారతదేశం సాధించిన విజయాన్ని విస్తృతంగా గుర్తించినట్లు చెప్పారు. భారతదేశం ప్రపంచ స్థాయిలో ఉన్నత ప్రతిష్టను కలిగి ఉన్నదని, సమస్యలను పరిష్కరించుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పుతిన్ అన్నారు.
శ్రీనగర్లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్కు ఐసీసీ మార్గదర్శకాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..