అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్ రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోయింది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు డాక్టర్ జిల్ బైడెన్ ఆతిథ్యంలో సోమవారం ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు బైడెన్ కార్యవర్గంలోని 200 మంది ఇండియన్ అమెరికన్లు హాజరయ్యారు. అతిథులంతా భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారత్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.