న్యూయార్క్: అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్పై దాడి(US Strikes) చేశాయి. ఇరానీ మిలిటరీ కేంద్రంపై అటాక్ చేశారు. డ్రోన్లను కూల్చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదకరంగా మారిన సుమారు నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు పేర్కొన్నాయి. బందర్ అబ్బాస్లో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ను కూడా అమెరికా దళాలు పేల్చేశాయి. డ్రోన్ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ కంట్రోల్ స్టేషన్ను పేల్చారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మూడు నెలలుగా సాగుతున్న వార్ వల్ల ఇరాన్లో వేల మంది మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. అయితే హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే అంశంలో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ను ఓపెన్గా ఉంచాలని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, ఒమన్ దేశాలు హోర్ముజ్ను సంయుక్తంగా ఆపరేట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ట్రంప్ ఖండించారు.