వాషింగ్టన్: టికెట్ డబ్బుల రీఫండ్లో తీవ్రమైన జాప్యం జరిగిందని పేర్కొంటూ టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియాపై అమెరికా రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. ప్రయాణికులకు రూ.983 కోట్లు చెల్లించాలని ఆదేశించడంతో పాటు రీఫండ్లో జాప్యానికి రూ.11.33 కోట్ల జరిమానా విధించింది. విమాన సర్వీసులు రద్దు లేదా పలు మార్పులు కారణంగా ఎయిరిండియా ప్రయాణికులకు టికెట్ డబ్బులు రీఫండ్ చేయాల్సి వచ్చింది.