టెహ్రాన్: ఇరానీ ట్యాంకర్ల(Iranian Oil Tankers)పై అమెరికా దళాలు అటాక్ చేశాయి. సుమారు అయిదు ట్యాంకర్లను పేల్చినట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి అమెరికా యుద్ధనౌకను ఇరాన్ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం ప్రతీకార దాడులకు దిగినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ఉన్న ఐఆర్జీసీకి చెందిన నాలుగు ఇరానీ ఆయిల్ ట్యాంకర్లను టార్గెట్ చేసింది అమెరికా. ఖర్గ్ దీవి దగ్గర మరో ట్యాంకర్ను కూడా పేల్చేశారు. అమెరికా తాజా దాడులకు కౌంటర్గా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది.
జోర్డాన్లో ఉన్న అమెరికా బేస్ను టార్గెట్ చేసింది. అయితే ఇరాన్ ప్రయోగించిన 20 క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఎదుర్కొన్నట్లు జోర్డాన్ చెప్పింది. మొత్తం 18 క్షిపణులను కూల్చినట్లు పేర్కొన్నది. గత వారం నుంచి ఇరాన్, అమెరికా మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
మరో వైపు ఆసియాలో ట్రేడింగ్లో ఇంధన ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్పై 1.5 శాతం పెరిగింది. ఇక అమెరికా ఇంధనం 1.6 శాతం అధికంగా ట్రేడింగ్ అయ్యింది. జోర్డాన్పై ఇరాన్ ఫైర్ చేసిన క్షిపణుల్లో రెండు మాత్రం జనాభా లేని ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది.