వాషింగ్టన్: ఇరాన్కు అమెరికా తాజాగా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం ఇరాన్పై అత్యంత తీవ్రమైన దాడులను చేయనున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఇరాన్పై మరిన్ని ఫైటర్లు, మరిన్ని బాంబర్లు, మరిన్ని దాడులు చేస్తాం.
ఇంటెలిజెన్స్ గతంలో కన్నా బాగా మెరుగైంది’ అని హెగ్సేత్ పేర్కొన్నట్టు బీబీసీ వెల్లడించింది. వారిని బలహీనపర్చడంతో గత 24 గంటల్లో ఇరాన్ అతి తక్కువ సంఖ్యలో క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. అమెరికా నిర్ణయాత్మక విజయం వైపు ఉందని, ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉందని హెగ్సేత్ పేర్కొన్నారు.